తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీ రాజ్ ఏఈ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అయితే, ఈ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు గోదావరిలో దూకగా.. స్థానికంగా ఉండే మత్స్యకారులు ఒక్కర్ని మాత్రమే కాపడగా, మిగతా ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పిఠాపురానికి చెందిన పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకారు. నూకరాలు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కలిసి గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనలో 60 ఏళ్ల నూకరాజు, 58 సంవత్సరాల ఆయన భార్య మీనా, 34 సంవత్సరాల కుమార్తె సౌజన్య గోదావరిలో గల్లంతయ్యారు. నూకరాజు మనవడిని స్థానికంగా ఉండే మత్స్యకారులు గుర్తించి ప్రాణాలతో కాపాడారు.READ ALSO టాస్క్లు పూర్తి చేసి రోజుకు రూ.వేలల్లో సంపాదిస్తున్నారా? అయితే మీరు సైబర్ స్కామ్లో చిక్కుకున్నట్లే! బీ అలెర్ట్.. అస్సలు నమ్మొద్దురిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు 60 సంవత్సరాల వయస్సులో కుటుంబంతో సహా ఇలా చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఈ ఘటన జరగడానికి కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గల్లంతయిన ఈ ముగ్గురి కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. పెళ్లికి వెళ్లొస్తూ నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు..పెళ్లి వేడుకకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థులు తిరుగు ప్రయాణంలో గోదావరిలో గల్లంతయ్యారు. ఆచంట మండలం వల్లూరుతోటకు చెందిన మట్టా సంతోష్, అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు, శృంగవరప్పాడుకు చెందిన పోతుల లక్ష్మీభాను వికాస్ (18), నాగిరెడ్డి దుస్వంత్ సాయి (18), నాగబత్తుల తేజసాయి సూర్య (19), చెరుకూరి రాజా రాంచరణ్ (16), వీరమల్లు సాయి వెంకట కిరణ్ (18), మట్టా సంతోష్ శనివారం రాత్రి పెరవలిలో జరిగిన స్నేహితుడి