© 2026 nimisham.in

ఈ ఏడాది మార్చిలో గల్ఫ్ జలాల్లో జరిగిన ఇరాన్ సైనిక విమానాల ప్రమాద ఘటనపై నెలకొన్న సందిగ్ధతకు ఖతార్ తెరదించింది. తమ వద్ద ముగ్గురు ఇరాన్ పైలట్లు కస్టడీలో ఉన్నారంటూ అంతర్జాతీయ మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ఒకే ఒక పైలట్ మృతదేహాన్ని సముద్రం నుంచి స్వాధీనం చేసుకుని, దౌత్య నిబంధనల ప్రకారం ఇరాన్కు అప్పగించామని అధికారికంగా ప్రకటించింది.ఖతార్ రక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మార్చిలో జరిగిన ప్రమాదం తర్వాత విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో కేవలం ఒక పైలట్ భౌతిక కాయం మాత్రమే లభ్యమైంది. తమ భూభాగంలో గానీ, సముద్ర జలాల్లో గానీ మరే ఇతర ఇరాన్ పైలట్ సజీవంగా లేదా మరణించి లభించలేదని ఖతార్ స్పష్టం చేసింది. దీంతో, ముగ్గురు పైలట్లను ఖతార్ రహస్యంగా నిర్బంధించిందన్న ఆరోపణలకు ముగింపు పలికింది.పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ విమాన ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో, కూలిపోయిన విమానాలకు చెందిన ముగ్గురు పైలట్లను ఖతార్ దళాలు రక్షించాయని, కానీ అమెరికా ఒత్తిడి వల్ల వారిని విడుదల చేయడం లేదని ఇరాన్కు చెందిన కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. ఈ అంశంపై ఇరాన్ ప్రభుత్వం కూడా ఖతార్తో దౌత్యపరంగా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.ఖతార్లో అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావరం 'అల్ ఉదేయిడ్ ఎయిర్ బేస్' ఉంది. ఈ సున్నితమైన భౌగోళిక
,