
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీతో తనకు సోదర అనుబంధం ఉందని మరోసారి తెలుగు షట్లర్ పీవీ సింధు తెలిపింది. తాజాగా ఆర్సీబీ పాడ్కాస్ట్లో సింధు మాట్లాడుతూ.. విరాట్ ఇచ్చిన సలహాతోనే తన ఆలోచనా విధానం మారిందని గుర్తు చేసుకుంది. ప్రస్తుతం పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ బరిలోకి దిగింది. ఇప్పటికే తొలి రౌండ్లో అద్భుత విజయం సాధించింది. ‘‘నాకు విరాట్ కోహ్లీ సోదరుడిలాంటి వారు. ఎందుకంటే నేను క్లిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయనను కలిసిన సందర్భం నాకు గుర్తుంది. కోహ్లీ చాలా ఓదార్పుగా మాట్లాడారు. ‘ఇప్పుడేమైంది? నీ గేమ్ నువ్వు ఆడు. ఆటోమేటిగ్గా ఫలితాలు అనుకూలంగా రావడం మొదలవుతాయి. నీ సత్తా ఏంటో నీకు తెలుసు. చాలా బాగా ట్రైనింగ్ అయిన అథ్లెట్వి. ప్రపంచానికి మరోసారి చాటిచెప్పు’ అని స్ఫూర్తి నింపారు. ఆ సంభాషణ తర్వాత నా ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. నేను విజయం సాధించిన ప్రతిసారి కోహ్లీతో పంచుకున్నా. ఎప్పుడు కలిసినా చాలా సంతోషంగా అనిపించేది. జీవితంలో ఎంతో సాధించిన గొప్ప వ్యక్తి నుంచి వచ్చే సూచనలు కూడా చాలా విలువైనవి’’ అని సింధు తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు