
కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రిని ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు వరించింది. మహిళల డబుల్స్లో తన భాగస్వామి ట్రీసా జాలీతో కలిసి పుల్లెల గాయత్రి ఈ పురస్కారానికి ఎంపికైంది. వీరితో పాటు డెకాథ్లాన్ అథ్లెట్ తేజస్విన్ శంకర్, చెస్ ప్రపంచకప్ విజేత దివ్య దేశ్ముఖ్ సహా మొత్తం 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులను ప్రకటించారు. అయితే, ఈ ఏడాది దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును ఎవరికీ ప్రకటించకపోవడం గమనార్హం.సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ అవార్డుల జాబితాను విడుదల చేసింది. గత నాలుగేళ్లుగా నిలకడగా రాణిస్తూ, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన వారికి అర్జున అవార్డును ప్రదానం చేస్తారు. కామన్వెల్త్ క్రీడల్లో డెకాథ్లాన్లో పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా తేజస్విన్ శంకర్ చరిత్ర సృష్టించగా, ఫిడే మహిళల ప్రపంచ కప్ గెలుచుకుని దివ్య దేశ్ముఖ్ సంచలనం రేపారు. హాకీ క్రీడాకారుడు హార్దిక్ సింగ్ పేరు ఖేల్ రత్న కోసం పరిశీలనకు వచ్చినప్పటికీ, అతను పోటీ నుంచి తప్పుకోవడంతో ఈసారి ఎవరికీ ఈ పురస్కారం దక్కలేదని తెలిసింది.సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుడు అరుమై నాయగంను అర్జున అవార్డు (జీవన సాఫల్యం) వరించింది. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడు