
భారత ప్రధాన నరేంద్ర మోదీ శనివారం రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఫోన్లో మాట్లాడారు. తనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ సంభాషణ సందర్భంగా భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు చేపట్టాల్సిన కీలక చర్యలపై వారు చర్చించారు. దీనితో పాటు జేడీ వాన్స్-సెకండ్ లేడీ ఉషా వాన్స్ దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించిన సందర్భంగా ప్రధాని మోదీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.రాజ్యతంత్రంలో రాచఠీవి.. మన నెమళ్లు ఇక ఐక్యరాజ్యసమితిలో విదేశీ నిధుల చట్టం వివాదం నేపథ్యం భారత్లోని ఎన్జీఓలు, ట్రస్టులు, విద్యాసంస్థలు, మతపరమైన సంస్థలకు అందే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) ప్రతిపాదిత సవరణలపై ఆమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిలే మూర్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లోనే ఈ ఫోన్ సంభాషణ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చట్ట సవరణలు మత సంస్థలపై ప్రభావం చూపిస్తాయని రిలే మూర్ కామెంట్ చేయగా.. చట్టసభల వ్యవహారాలు భారత అంతర్గత అంశాలని, అమెరికా సహా పలు దేశాల్లో విదేశీ నిధులను నియంత్రించే చట్టాలు అమల్లో ఉన్నాయని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్షణాన్ని ఆస్వాదించండి! యువతకు మోదీ బిగ్ మెసేజ్..గతంలో ఫోన్ సంభాషణను గుర్తుచేసుకున్న నేతలు మే 2025లో పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో జేడీ వాన్స్, ప్రధాని మోదీ మధ్య జరిగిన చివరి ఫోన్ సంభాషణను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో భారత్పై పాకిస్తాన్ భారీ దాడికి ప్లాన్ చేస్తోందని జేడీ వాన్స్ హెచ్చరించగా.. మా స్పందన అంతకంటే మరింత బలంగా, తీవ్రంగా ఉంటుంది అని తానిచ్చిన సమాధానాన్ని ప్రధాని మోదీ గతంలో లోక్సభ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే