
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pcc chief Mahesh kumar goud reacts on Konda Sushmitha Comments: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సురేఖ, కొండా సుష్మిత వివాదం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీ సైతం సీరియస్ అయ్యింది. ఎంపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడుతూ..కొండా సురేఖ ఇచ్చిన రీప్లై చూశామన్నారు. కొండాసుష్మిత సీఎం రేవంత్ రెడ్డిని మాములు వ్యక్తి గా అనుచిత వాఖ్యలు చేశారన్నారు. దీనిపై అందరూ ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎవరైన పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్నారు. కొండా సుస్మిత పార్టీ లైన్ దాటి నేరుగా ఆరోపణలు చేశారని పీసీసీ చీఫ్ చెప్పుకొచ్చారు. అనిరుధ్, రాజగోపాల్ డైరెక్ట్గా విమర్శలు చేయలేదని మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ లో మాట్లాడారు. మంత్రి కొండా సురేఖను గతంలో కాపాడామని.. ఇప్పుడు అవకాశం లేదన్నారు. Read more: Naveen Kumar Yadav: సీఎం పట్ల అగౌరవంగా మాట్లాడితే సహించం.!. కొండా సురేఖ వివాదంపై రంగంలోకి నవీన్ కుమార్ యాదవ్..! కొండా సురేఖపై అధిష్టానం సీరియస్గా ఉందన్నారు. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత లైన్ దాటి ఆరోపణలు చేశారని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. కానీ రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి లైన్ దాటలేదన్నారు. పార్టీ లైన్ ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని చిట్ చాట్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్