
కురుపాం గ్రామీణం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం జరడ పంచాయతీలో పరిధిలో రహదారి సమస్య పరిష్కారించాలని కోరుతూ మంగళవారం అర్ధనగ్నంగా నిరసనకు దిగారు. జరడ, గెడ్డగూడ, ములుగూడ, గుమ్మిడిగూడ, పొడిదం, పట్టాయిగెడ్డ, కంబమానుగూడ గ్రామాలకు ఉన్న రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, వర్షాలు కురిసినప్పుడు రాకపోకలు మరింత కష్టతరంగా మారుతున్నాయని తెలిపారు. అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రులకు తరలించడం కూడా సమస్యగా మారిందన్నారు. రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరుతూ పలుమార్లు ఐటీడీఏ పీఓ, జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గిరిజనులు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారి నిర్మాణం లేదా మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.