
కురుపాం గ్రామీణం: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్ అన్నారు. మంగళవారం కురుపాంలోని పలు వీధుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కొండయ్య, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.