
ఇంటర్నెట్ డెస్క్: ఆత్మహత్య చేసుకోబోతున్న కొడుకును కాపాడబోయి కుటుంబం మృత్యువుబారిన పడిన విషాద ఘటన మహారాష్ట్ర (Maharashtra)లోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జల్తా ఫాటా ప్రాంతానికి చెందిన 19ఏళ్ల యువకుడు కునాల్ చంద్గుడే మొబైల్ ఫోన్ విషయంలో శుక్రవారం తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. అనంతరం ఆత్మహత్య చేసుకుంటానని వారిని బెదిరించి, ఉదయం 10గంటల సమయంలో ఖవ్డా కొండ వద్దకు చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు మురళీధర్ (48), సంగీత కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అతడికి నచ్చజెప్పడానికి వారు దాదాపు 3గంటల పాటు ప్రయత్నం చేశారు. దగ్గరకు వస్తే దూకేస్తానని వారిని బెదిరించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిందకు రావాలని యువకుడికి ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. అతడిని కాపాడడానికి కింద వల ఏర్పాటు చేస్తే.. మరో అంచుకువెళ్లి బెదిరింపులకు పాల్పడ్డాడు. వేరేదారి లేక అతడి తండ్రి కూడా కొండపైకి ఎక్కి.. యువకుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. పట్టుతప్పడంతో ఇద్దరూ కొండ అంచు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్పరిణామంతో షాక్కు గురైన ఆ యువకుడి తల్లి కూడా కొండపై నుంచి దూకేసింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఉపాధ్యాయుడు, మహిళా టీచర్ మధ్య ‘అతి సాన్నిహిత్యం’.. విద్యార్థుల ఫిర్యాదు గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వరద నీటిలో చిక్కుకున్న