
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంటే, ఏపీలో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఏపీ ప్రభుత్వం వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా మరొక కొత్త కార్యక్రమానికి ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది.స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధికి కొత్త కార్యక్రమంపర్యావరణహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా గ్రామీణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించనుంది. గ్రామీణ ప్రాంతాలలో లభించే గుర్రపు డెక్క నుండి సేంద్రియ ఎరువు తయారీ ప్రక్రియను మహిళల ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాల ద్వారా అమలవుతుంది.ఏపీ ఫర్ సేల్.. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్: మాజీమంత్రి సంచలనం!ఈ జిల్లాలో చెత్త నుండి సంపద కేంద్రాలలో సేంద్రీయ ఎరువుల తయారీఏపీలో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలలో చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాల ద్వారా మహిళలు గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. తొలి విడతగా తూర్పుగోదావరి జిల్లాలోని 10మండలాలలో 11గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. అనపర్తి, తోసిపూడి, సమిశ్రగూడెం, ద్వారపూడి, జేగురుపాడు, కోలమూరు, నుదుపల్లి, లొల్ల, పల్లంగి, కపిలేశ్వరపురం, ఉండ్రాజవరం వంటి గ్రామపంచాయతీలలో సంపద సృష్టి బాధ్యతలను ఎస్ హెచ్ జీ మహిళలకు అప్పగించారు.గుర్రపు డెక్క ద్వారా ఎరువుల తయారీపై శిక్షణజిల్లాలో ఉన్న 307 సంపద సృష్టి కేంద్రాలలో, 11 కేంద్రాలను మహిళలకు అప్పగించారు. వీరికి గుర్రపు డెక్క ద్వారా ఎరువుల తయారీపై శిక్షణ ఇచ్చారు. చాప్ కట్టర్స్ కొనుగోలుకు రుణాలను మంజూరు చేశారు. ఈ యంత్రాల సాయంతో గుర్రపు డెక్కను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి శాస్త్రీయ పద్దతిలో సేంద్రీయ ఎరువులు తయారు చేస్తున్నారు. ఒకే ఉద్యోగి.. రెండు చోట్ల జీతాలు - ప్రభుత్వ శాఖల్లో మాయాజాలం, గుట్టు