పాకిస్థాన్ టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ 2026 సిరీస్లో భాగంగా హెడింగ్లే వేదికగా ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు అతిథ్య జట్టు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ నమ్మకాన్ని వారి పేసర్లు వంద శాతం నిలబెట్టారు. గాయం కారణంగా స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ దూరం కావడంతో కొత్త కెప్టెన్ సల్మాన్ అఘా సారథ్యంలో బరిలోకి దిగిన పాకిస్థాన్కు మ్యాచ్ ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ అజాన్ అవైస్ పరుగులేమీ చేయకుండానే ఆలీ రాబిన్సన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు.ఆ తర్వాత అబ్దుల్లా షఫీక్ (61; 8 ఫోర్లు), ఇమామ్-ఉల్-హక్ (42; 6 ఫోర్లు) కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. దీంతో పాక్ 97/2తో కోలుకున్నట్లే కనిపించింది. కానీ అనూహ్యంగా కుప్పకూలే అలవాటు ఉన్న పాక్.. ఈమ్యాచులోనూ అదే ప్రదర్శన చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (5), సౌద్ షకీల్ (5), సల్మాన్ అఘా (21), మహమ్మద్ రిజ్వాన్ (12) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. దీంతో పాక్ కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్ పేసర్ల పక్కా ప్లానింగ్ ముందు పాకిస్థాన్ బ్యాటర్లు నిలవలేకపోయారు.ఇంగ్లాండ్ బౌలర్లలో ఆలీ రాబిన్సన్ 51 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా, జోష్ టంగ్ 46 పరుగులకే 5 వికెట్లు తీసి పాక్ వెన్ను విరిచారు. ఫలితంగా పాకిస్థాన్ 48.1 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది. జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఎమిలియో గే (33) పర్వాలేదనిపించినా, పాకిస్థాన్ పేసర్ మహమ్మద్ అలీ క్యాచ్ ఔట్ చేసి ఇంగ్లాండ్ను దెబ్బతీశాడు. 48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రిజ్లోకి వచ్చిన స్టార్ బ్యాటర్ జో రూట్, జోర్డాన్ కాక్స్తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వీరిద్దరూ మూడో వికెట్కు