
భారతదేశంలో దశాబ్దాలుగా అత్యంత ప్రజాదరణ పొందిన డార్క్ రమ్ బ్రాండ్ 'ఓల్డ్ మాంక్' తీవ్ర వివాదంలో చిక్కుకుంది. నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘన, లేబుళ్లపై తప్పుదారి పట్టించే సమాచారం వంటి కారణాలతో ఈ బ్రాండ్కు చెందిన కొన్ని వేరియంట్ల అమ్మకాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిషేధించింది. ఈ వార్త ఓల్డ్ మంక్ అభిమానులకు, మద్యం రంగ నిపుణులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.మహారాష్ట్రలోని ఒక డిస్టిలరీలో తయారైన ఓల్డ్ మాంక్ మూడు వేరియంట్లలో అనుమతి లేని కృత్రిమ ఫ్లేవర్లను గుర్తించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తన నివేదికలో పేర్కొంది. సహజసిద్ధమైన రుచి, వాసనను అనుకరించేలా వీటిని వాడటం వినియోగదారులను మోసం చేయడమేనని స్పష్టం చేసింది. ఓల్డ్ మంక్తో పాటు మెక్డొవెల్స్, రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ బ్లూ విస్కీలకు చెందిన కొన్ని బ్యాచ్లపై కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలు తీసుకుంది.దీంతో పాటు, ఓల్డ్ మాంక్ బాటిళ్లపై ఉన్న "7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్" అనే వాదన కూడా తప్పుదారి పట్టించేలా ఉందని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. 2018 ఆహార భద్రత, ప్రమాణాల (ఆల్కహాలిక్ బెవరేజెస్) నిబంధనల ప్రకారం, ఏదైనా మద్యం మిశ్రమంలో అతి తక్కువ వయసు ఉన్న స్పిరిట్ వయసునే లేబుల్పై ప్రకటించాలి. అయితే, ఓల్డ్ మాంక్ రమ్లో ఎక్కువ భాగం వయసు నిర్ధారణ లేని సాధారణ స్పిరిట్తో తయారుచేసి, కేవలం 5 శాతం కన్నా తక్కువ మాత్రమే ఏళ్ల తరబడి నిల్వ ఉంచిన రమ్ను కలుపుతున్నారని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆక్షేపించింది.ఓల్డ్ మాంక్.. కేవలం బ్రాండ్ కాదు, ఒక జ్ఞాపకంఓల్డ్ మాంక్