
నెల్లూరు (నగర పాలక సంస్థ): దేశవిదేశాల నుంచి ఆంధ్రులు వచ్చి ఓట్లు వేసి కూటమిని గెలిపించారు. కూటమి ప్రభుత్వ ఘనవిజయం ఒకచరిత్ర.. వైకాపా ఘోర పరాజయం కూడా చారిత్రక ఘట్టంమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వైకాపా ఐదేళ్లు ప్రజావ్యతిరేక పాలన సాగించిందన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైకాపా కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ వికృత రాజకీయం చేస్తుందన్నారు. హిందు మతానికి ఘోర అన్యాయం జరిగిందని ఎలా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఆలయాల్లో రథాలు తగులపడినప్పుడు, విగ్రహాలు తలలు తెగగొట్టినప్పుడు, సింహాలు చోరీకి గురైనప్పుడు మీ నోళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏపీని అస్థిరం చేయాలని ఓ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలు, పెట్టుబడులు రాకూడదని ఫేక్ వీడియోలతో ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైకాపా క్రెడిట్ చోరీ చూస్తుంటే నాగార్జునసాగర్, సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టులు కట్టింది జగన్ అని చెప్పేట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు