
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. National Sports Awards 2025 Winners List: జాతీయ క్రీడా పురస్కారాలు 2025ను క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తం 17 మంది క్రీడాకారులను అర్జున పురస్కారానికి ఎంపిక చేసింది. చెస్ క్రీడాకారులు విదిత్ గుజరాతీ, దివ్య దేశ్ముఖ్, షట్లర్లు ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్, అథ్లెట్లు తేజస్విన్ శంకర్, ప్రియాంక గోస్వామి ఈ పురస్కార గ్రహీతలలో ఉన్నారు. మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు ఐ.అరుమాయినాయగం అర్జున పురస్కారం (జీవితకాల) అందుకోనున్నారు. అయితే దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు మాత్రం ఎవరినీ ఎంపిక చేయలేదు. ఈ విషయంపై ప్రస్తుతం క్రీడా వర్గాల్లో ప్రధాన చర్చ మొదలైంది. క్రీడా పురస్కారాల ఎంపిక కోసం మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ సిఫార్సుల ఆధారంగా 17 మంది క్రీడాకారులను అర్జున అవార్డులకు ఎంపిక చేసినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం. అయితే 2025 సంవత్సరానికి ఈ అవార్డుకు ఒక్క క్రీడాకారుడి పేరును కూడా ప్రకటించలేదు. అవార్డు ప్రారంభమైన తర్వాత ఇలా జరగడం చాలా అరుదు. గతంలో 2008, 2014 సంవత్సరాల్లో మాత్రమే ఖేల్ రత్నకు ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇదిలా ఉంటే.. అర్జున అవార్డుల ద్వారా వివిధ క్రీడా విభాగాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులను ప్రభుత్వం గుర్తించింది. ఈ అవార్డు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ, స్థిరమైన ప్రదర్శనకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక గౌరవంగా