
ప్రధాని నరేంద్ర మోదీ, కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ప్రాంతీయ కూటమి కీలక చర్చల్లో భాగంగా ఇతర దేశాధినేతలతో కలిసి ఆయన గ్రూప్ ఫొటోగ్రాఫ్లో పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇతర దేశాల నేతలతో కలిసి ఒకే వేదికపై ఫొటోలకు పోజిచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కిర్గిజ్స్థాన్ అధ్యక్షుడు సాదిర్ జపరోవ్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్-కిర్గిజ్స్థాన్ మధ్య సంబంధాల పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ చర్చల ద్వారా పరస్పర ప్రయోజనం ఉన్న రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారానికి మరింత ఊపు లభిస్తుందని భావిస్తున్నారు.అంతకుముందు ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు బిష్కెక్కు చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి ప్రవాస భారతీయుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. 'భారత్ మాతా కీ జై', 'వందే మాతరం' నినాదాలతో వారు హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్రవాసులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను, యోగా ప్రదర్శనలను మోదీ తిలకించి వారిని అభినందించారు. "భారత్ నుంచి బిష్కెక్కు.. ఈ సాయంత్రం భారత సమాజం నుంచి చాలా ప్రత్యేకమైన స్వాగతం లభించింది" అని ప్రధాని మోదీ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.బిష్కెక్లోని మానస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిర్గిజ్ రిపబ్లిక్ క్యాబినెట్ మంత్రుల ఛైర్మన్ ఆదిల్బెక్ కాసిమలియేవ్