© 2026 nimisham.in

రాష్ట్ర విద్యా వ్యవస్థలో సంస్కరణల శకం పూర్తయిందని, ఇకపై నూరు శాతం ఫలితాలు సాధించడమే అందరి లక్ష్యం కావాలని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విజయనగరం దాసన్నపేటలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజాప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు పూర్తయ్యాయని, ఇప్పుడు పూర్తిగా అభ్యసన ఫలితాలపైనే దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.గత ఏడాది సంస్కరణల ఫలితంగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, అయితే ఇది తొలిమెట్టు మాత్రమేనని లోకేశ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఫలితాలతో సంతృప్తిగా లేరని, నూరు శాతం ఫలితాలనే ఆశిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఇకపై ప్రతినెలా ఒక క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా వినూత్న పద్ధతుల్లో మెళకువలు నేర్పాలని సూచించారు.యువగళం పాదయాత్ర సమయంలో కర్నూలు జిల్లాలో వలస కుటుంబాలను, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను చూసి చలించిపోయానని, అప్పుడే విద్యారంగంలో సంస్కరణలు తేవాలని నిర్ణయించుకున్నానని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. విద్యాశాఖ ఎంతో సవాలుతో కూడుకున్నదైనా, సమాజంలో మార్పు విద్య ద్వారానే సాధ్యమని తాను నమ్ముతానని పేర్కొన్నారు.విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక 10 వేల పాఠశాలల్లో 'వన్ క్లాస్ వన్ టీచర్' విధానం తెచ్చామని, డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని వివరించారు. ఈ ఏడాది మరో డీఎస్సీ ద్వారా అదనంగా 3