
గ్లోబల్ ఎన్ఆర్ఐ చీఫ్ డాక్టర్ రాజా కుమారుడి వివాహ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు. అమరావతి: గ్లోబల్ ఎన్ఆర్ఐ చీఫ్ డాక్టర్ రాజా కుమారుడి వివాహ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు. వివాహ వేడుకలో నూతన వధూవరులను నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. లోకేష్ దంపతులు తమ కుటుంబ వివాహ వేడుకకు హాజరు కావడంతో డాక్టర్ రాజా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి, బిజీ షెడ్యూల్లోనూ ప్రత్యేకంగా సమయం కేటాయించి అమెరికా వచ్చి వివాహ వేడుకలో పాల్గొన్నందుకు నారా లోకేష్కు డాక్టర్ రాజా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ దంపతుల రాకతో వివాహ వేడుక మరింత సందడిగా మారిందని, వారితో ఆత్మీయంగా గడిపిన క్షణాలు తమ కుటుంబానికి ఎప్పటికీ మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని డాక్టర్ రాజా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బాల్టిమోర్లో ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు మనోహర్రెడ్డికి ‘ఎన్ఆర్ఐ అచీవర్స్ అవార్డ్-2026’