.webp)
విజయవాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన లోకేశ్..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణపై కూటమి ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది. అమరావతే రాష్ట్రానికి ఏకైక రాజధాని అని, మన గుర్తింపునకు అదే ప్రధాన చిరునామా అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ వేడుకల్లో మంత్రి లోకేశ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, "ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని" అనేది తమ ప్రభుత్వ అజెండా అని తేల్చిచెప్పారు. అమరావతి రాజధానిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూనే, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. కుల, మత, ప్రాంతీయ భేదాలను పక్కనబెట్టి ప్రతి ఒక్కరూ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తున్నామని మంత్రి వివరించారు. ఈ ఏడాది దాదాపు 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థలను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడమే తాము సాధించిన పురోగతికి నిదర్శనమని చెప్పారు. విద్యా వ్యవస్థలో రాజకీయాలకు తావులేకుండా పారదర్శక పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్టూడెంట్ కిట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా నాణ్యమైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని, అలాగే నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సేవలను సలహాదారుగా వినియోగించుకుంటున్నామని వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, జాతీయ జెండా