
టాటా సన్స్ ఛైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదవీకాలం 2027 ఫిబ్రవరి 20 వరకూ ఉన్నప్పటికీ తక్షణ నిష్క్రమణకు గల కారణాలు, కొత్త నాయకత్వ ఎంపిక గురించి చంద్రశేఖరన్ స్పష్టతనిచ్చారు. ఆంధ్రజ్యోతి, ఆగస్టు 12: ఆగస్టు 18న జరగనున్న టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశానికి (AGM) ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ ఛైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియాల్సి ఉంది. ఈ సందర్భంగా తన రాజీనామాకు గల కారణాలు, కొత్త నాయకత్వ ఎంపిక గురించి చంద్రశేఖరన్ స్పష్టతనిచ్చారు. మరో దఫా పొడిగింపునకు నిరాకరణ: ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత టాటా సన్స్ ఛైర్మన్గా తిరిగి కొనసాగేందుకు తాను సిద్ధంగా లేనని, ఈ విషయాన్ని బోర్డుకు స్పష్టం చేశానని చంద్రశేఖరన్ తెలిపారు. ఐకమత్యం కొరవడటమే కారణం: ఆయన పదవీకాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్లు ఏకగ్రీవంగా సిఫార్సు చేశాయి. అయితే బోర్డులోని ఒక సభ్యుడు దీనిని వ్యతిరేకించడంతో ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవ మద్దతు లభించలేదని వివరించారు. ఆరు నెలలుగా పెండింగ్లోనే స్పష్టత: ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేశానని, అయితే గత ఆరు నెలలుగా ఈ విషయమై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేకపోయారని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు వ్యూహాత్మక ప్రాజెక్టుల దృష్ట్యా: ప్రస్తుతం టాటా గ్రూప్ అనేక కీలక ప్రాజెక్టులను అమలు చేస్తోందని, ఇలాంటి కీలక సమయంలో సంస్థ పురోగతికి, ఉద్యోగులు, పెట్టుబడిదారుల నమ్మకానికి నాయకత్వంపై స్పష్టత ఉండటం చాలా అవసరమని స్పష్టం చేశారు. త్వరితగతిన కొత్త నాయకత్వ ఎంపిక: సంస్థలో నాయకత్వ మార్పిడి సునాయాసంగా జరిగేందుకు వీలుగా, వెంటనే తదుపరి ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని టాటా సన్స్ బోర్డును చంద్రశేఖరన్ కోరారు