© 2026 nimisham.in

ర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో నగరం అతలాకుతలమైంది. దీంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబైకి 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. రానున్న గంటల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.ఆదివారం ఉదయం 8 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విఖ్రోలి వెస్ట్లో 310.6 మి.మీ. వర్షం కురవగా, కొలాబా పంపింగ్ స్టేషన్ వద్ద 306.6 మి.మీ., టాగోర్ నగర్లో 301.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ఇళ్లు కూలగా, చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లు, రైల్వే ట్రాక్లపైకి నీరు చేరడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సబర్బన్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.ఈ నేపథ్యంలో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రజలను అప్రమత్తం చేసింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. సహాయం కోసం 1916 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించాలని తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు సముద్రంలో 4.19 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. థానే, నవీ ముంబై, పాల్ఘర్ వంటి సమీప ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది
.