
On This Day In Cricket: స్వాతంత్య్ర దినోత్సవం నాడు దేశమంతా సంబరాల్లో ఉండగా, భారత క్రికెట్ అభిమానుల గుండెలు మాత్రం ముక్కలయ్యాయి. సరిగ్గా 2020 ఆగస్టు 15వ తేదీన ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా ఏకకాలంలో అంతర్జాతీయ ఆటకు గుడ్బై చెప్పి యావత్ క్రీడాలోకాన్ని కన్నీట ముంచారు. ఆ భావోద్వేగ క్షణాలకు నేటితో సరిగ్గా ఆరేళ్లు. భారత చరిత్రలో ఆగస్టు 15 ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎర్రకోట నుంచి గల్లీ వరకు ప్రతి భారతీయుడు పండుగ చేసుకునే ఆ రోజున, సామాజిక మాధ్యమాల్లో ధోనీ పెట్టిన ఓ చిన్న పోస్ట్ సునామీ సృష్టించింది. తనదైన శైలిలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా ఆట నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ షాక్ నుంచి అభిమానులు తేరుకోకముందే, అతడి బాటలోనే నడుస్తూ సురేష్ రైనా కూడా అదే రోజున అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఇద్దరు పంచుకున్న భావోద్వేగ వీడ్కోలు సందేశాలు, వారి నిరాడంబర వీడ్కోలు ఇప్పటికీ అభిమానుల కళ్లలో నీళ్లు తెప్పిస్తాయి. ఎక్కువమంది చదివినది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..! క్రికెట్ చరిత్రలో ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. ధోనీ, రైనాల ప్రయాణం మాత్రం చాలా ప్రత్యేకం. జాతీయ జట్టులో అయినా, ఫ్రాంచైజీ క్రికెట్లో అయినా వీరిద్దరి కలయిక అద్భుత విజయాలను అందించింది. మిడిల్ ఆర్డర్లో వీరు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించేవి. విజయాలైనా, అపజయాలైనా ఏనాడూ విడిపోకుండా కలిసి పంచుకునేవారు. కేవలం సహచర ఆటగాళ్లుగానే కాకుండా ఒకరికొకరు సోదరుల్లా ఎదిగారు, వీరి అద్భుతమైన బంధం ఎప్పుడూ క్రికెట్ అనే ఆట కంటే గొప్పదిగానే నిలిచింది. ఎక్కువమంది చదివినది: IND vs ENG: ప్రపంచ రికార్డ్తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోతకు బలైన ఇంగ్లాండ్..! చెరిగిపోని జ్ఞాపకాలు.. సైలెంట్ వీడ్కోలు.. క్రికెట్ మైదానంలో