
Imran Khan Hospital : జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్కు పాక్ సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 73 ఏళ్ల ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణించడంతో పాటు కంటిచూపు మందగిస్తోంది. ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణించడంతో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయన్ను తక్షణమే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. పాక్ సుప్రీంకోర్టు నిర్ణయంతో గత కొన్ని నెలలుగా ఇమ్రాన్ విడుదలపై పోరాటం చేస్తున్న పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్, ఆయన కుటుంబానికి ఊరట లభించింది. ఇమ్రాన్ను 48 గంటల్లోగా షిఫా ఆసుపత్రికి తరలించాల్సిందిగా సూచించింది. పీటీఐ అధికార ప్రతినిధి ప్రకారం.. రాబోయే 48 గంటల్లోగా ఇమ్రాన్ ఖాన్ను షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ సెప్టెంబర్ 16 వరకు వైద్యుల పర్యవేక్షణలో ఈ ఆస్పత్రిలోనే ఉండనున్నారు. ఆస్పత్రికి ఎందుకంటే? : ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. కొంతకాలంగా ఆయన కుటుంబం ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. జైలులో చికిత్స ఆలస్యం కావడం వల్ల ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ క్రికెటర్లు ఇమ్రాన్ ఖాన్ జైలు పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. Read Also : Samsung Galaxy S26 Ultra : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్ మరి ఇంత తక్కువా.. ఏకంగా రూ. 26,500 తగ్గింపు..! పీటీఐ అధికార ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ మాట్లాడుతూ.. “ఈ నిర్ణయం మాకు ఊరటనిచ్చింది. ఈ ఉత్తర్వు ముందే వచ్చి ఉంటే ఆయన కళ్లకు, ఆరోగ్యానికి ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకునేవరకు ఆస్పత్రిలోనే ఉంచాలి” అని డిమాండ్ చేశారు