
ప్రపంచంలో అత్యంత విలువైన లోహం బంగారం అని మన అందరికీ తెలుసు. కానీ, మన దేశంలో బంగారం కంటే వెయ్యి రెట్లు విలువైన మొక్క ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ మొక్క ఆకుల ధర వేలల్లో పలుకుతుంది. ఈ ఆకులను చైనా సైతం అక్రమంగా దొంగలించేసి..అక్రమంగా కూడా అమ్మేస్తున్నారు. ఆ మొక్క పేరే ‘మిష్మీ తీత’. అసలు ఈ మొక్క ఎక్కడ దొరుకుతుంది? దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? దీనికి ఇంత విలువ ఎందుకు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మిష్మీతీత అనేది అరుదైన, అత్యంత విలువైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం ‘క్యాప్టిస్ తీత’. ఇది మనకు హిమాలయాల్లో మాత్రం దొరుకుతుంది. దీని వేళ్లు చాలా చేదుగా ఉంటాయి. తీత అంటే.. ఈశాన్య ప్రాంత భాషల్లో చేదు అని అర్థం. అందుకే..దీనికి ఆ పేరు వచ్చింది. సంప్రదాయ ఆయుర్వేదం, చైనీస్ మెడిసిన్, ఈశాన్య భారత గిరిజన వైద్యంలో దీనిని చాలా రకాల వైద్యాలలో వాడతారు. ఈ మొక్క ఆకుల్లో బెర్బెరిన్ అనే ముఖ్యమైన రసాయనం ఉంటుంది. దీని వల్ల ఇది మలేరియా, కంటి సమస్యలు, కడుపు రుగ్మతలు, జ్వరం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడ దొరుకుతుంది? ప్రధాన ప్రాంతం: ఇది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని 'మిష్మీ కొండలు' (Mishmi Hills) ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది. అందుకే దీనికి 'మిష్మీ తీత' అనే పేరు వచ్చింది. భౌగోళిక సరిహద్దులు: అరుణాచల్ ప్రదేశ్తో పాటు చైనాలోని టిబెట్ సరిహద్దు ప్రాంతాలలో, మిజోరాం, నాగాలాండ్ , మయన్మార్ సరిహద్దు అడవులలో కూడా ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. వాతావరణం: ఇది సముద్ర మట్టానికి దాదాపు 2,000 నుండి 3,000 మీటర్ల ఎత్తులో, తేమ, చల్లదనం ఎక్కువగా ఉండే దట్టమైన సదాహరిత (Evergreen) అడవులలో మాత్రమే పెరుగుతుంది. ఈ మొక్కకు భారీ డిమాండ్ ఉంది. అయితే, విపరీతమైన వాడకం