ఓ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థినిలు ఉన్నట్టుండి ఏకారణం లేకుండా నవ్వడం, ఆ తర్వాత ఉన్నపళంగా నిశ్శబ్దంగా ఉండిపోవడంతో అలజడి రేగింది. దెయ్యాలు పట్టాయనే ప్రచారం, ఊహాగానాలతో వందల మంది పిల్లలను తమ తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. ఈ వింత సంఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మేల్ఘాట్ గిరిజన ప్రాంతంలో గల దోమా గ్రామంలోని ఒక ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికార, వైద్యుల బృందం పాఠశాలను సందర్శించి ‘ మాస్ హిస్టీరియా ’ (సామూహిక మానసిక ఆందోళన)గా నిర్ధారించారు. పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ లీనా రాథోడ్ గురువారం ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించారు.తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల ఇలాంటి సామూహిక ప్రతిచర్యలు ఎదురవుతాయని, వైద్య పరిభాషలో దీనిని 'మాస్ సైకోజెనిక్ ఇల్నెస్' అంటారని వైద్య అధికారి డాక్టర్ అభిషేక్ నాయుడు వెల్లడించారు. వారం రోజుల కిందట 16 మంది బాలికలు ఒక్కసారిగా ఏడ్వటం, నవ్వడం, ఆపై ఏ భావోద్వేగం లేకుండా చేష్టలుడిగిపోవడంతో ఈ ఘటన మొదలైందని అధికారులు తెలిపారు. కొందరు విద్యార్థులకు గజ్జెల శబ్దాలు వినిపించినట్లు చెప్పడంతో ఈ పుకార్లు హాస్టల్ నుంచి గ్రామానికి దావానలంలా వ్యాపించాయి.అయితే, ఈ ఆశ్రమ పాఠశాలలో దీర్ఘకాలంగా ఉన్న నిర్వహణ లోపాలను ఈ ఘటన బయటపెట్టిందని గిరిజనాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. సరిపడా స్థలం లేక ఇరుకు గదులు, నాణ్యమైన ఆహారం అందించికపోవడం, పారిశుద్ధ్య లోపాలు విద్యార్థుల ఒత్తిడికి కారణమయ్యానని పేర్కొన్నారు. మొదటి సంఘటన జరిగిన వెంటనే సరైన కౌన్సెలింగ్ ఇవ్వకపోవడం, ఆలస్యంగా స్పందించడం వల్లే ఈ భయాందోళనలు మరింత వ్యాపించాయని అధికారులు అంగీకరించారు. పాఠశాల ఆవరణలోని ఒక ఇప్ప చెట్టును నరకడం వల్లే ఇలా జరిగిందని కొందరు ఆరోపించగా, ఆ చెట్టును ఆరేళ్ల కిందటే నరికారంటూ హెడ్ మాస్టర్ సంజయ్ చౌదరి ఆ వార్తలను ఖండించారు.విద్యార్థులకు ధైర్యం చెప్పేందుకు 'అఖిల భారత మూఢనమ్మకాల నిర్మూలనా