
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Mla Naveen kumar Yadav reacts konda Sushmita row: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ, కొండా సుష్మిత అంశం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇప్పటికే పీసీసీ డిసిప్లీనరీ కమిటీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. దీనిపై వెంటనే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక మంత్రి కొండా సురేఖ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చాక అన్ని విషయాల్ని కలిసి చెప్తానని కూల్ గా చెప్పారు. ఈ వివాదంపై అనేక ఊహగానాలు రాజకీయా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ వివాదంపై తాజాగా.. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ స్పందించారు. కొంత మంది నేతలు కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంను బలహీనపర్చేవిధంగా కుట్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ గా, ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్ ను అధికారంలోకి తెవడానికి ఎంతో శ్రమించారన్నారు. ప్రజలకు ఇచ్చిన పథకాల హమీలను నెరవెర్చే విధంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. అనేకమంది యువకులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకోసం అందుబాటులో శ్రమించినవారిని గుర్తిస్తు.., ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా, పలు బాధ్యతలు అప్పగించిందని చెప్పారు. బీసీ నాయకుడిగా తనను కూడా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందని చెప్పారు. కష్ట పడితే పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని అన్నారు. రెండేళ్ల తర్వాత వచ్చే