
ఈశాన్య భారతంలో ప్రకృతి కోపానికి, పొంగిపొర్లిన వరద రాకాసికి జీవితం అల్లకల్లోలమైన వేళ.. ఓ మూగజీవం మరణపు అంచుల దాకా వెళ్లి నిలబడింది. 53 ఏళ్ల వయసున్న జాయ్మతి అనే ఆడ ఏనుగు వరద ఉధృతిలో కొట్టుకుపోయి సాయం కోసం దిక్కుతోచని స్థితిలో అలమటించింది.అయితే, మానవత్వం ఇంకా చావలేదని నిరూపిస్తూ అటవీ శాఖ, స్థానిక ప్రజలు దాన్ని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. తీవ్ర గాయాలతో రోదిస్తున్న ఆ ఐరావతానికి ఇప్పుడు ఊహించని రీతిలో పునర్జన్మ లభించబోతోంది. అత్యవసర శస్త్రచికిత్సల కోసం ఈ ఏనుగును ఏకంగా ప్రత్యేక విమానంలో గుజరాత్లోని అత్యంత ప్రాచుర్యం పొందిన వంతారా ఆసుపత్రికి తరలిస్తున్నారు. దేశ చరిత్రలోనే ఒక ఏనుగును విమానంలో తరలించడం ఇదే తొలిసారి!గత జులై నెలలో నాగాలాండ్, అస్సాం ప్రాంతాలను ముంచెత్తిన వరదల్లో జాయ్మతి కొట్టుకుపోయింది. ఉద్ధృతంగా పారే నీటి ప్రవాహంలో రాళ్లు, రప్పలు గుద్దుకోవడంతో దాని దేహమంతా క్షతగాత్రమైంది. నడుము, చెవులు, తోక, పొత్తికడుపు భాగాల్లో లోతైన గాయాలయ్యాయి.అంతకుముందే కలప మోసే పనుల్లో ఒక కాలు విరిగిపోవడంతో నడవలేని స్థితిలో ఉన్న ఈ ఏనుగు, వరద దెబ్బకు ఒక కంటి చూపును కూడా శాశ్వతంగా కోల్పోయింది. కంటి నుంచి నిరంతరం నీరు కారుతున్నా, అడుగు తీసి అడుగు వేయలేక నరకయాతన అనుభవిస్తున్నా.. ఆ మూగజీవి కళ్లలో జీవించాలనే ఆశ మాత్రం చావలేదు. ఏనుగు కోసం సుప్రీంకోర్టు తీర్పు! కస్టడీకి ఇస్తూ కామెంట్స్రోడ్డు ప్రయాణపు నరకం వద్దు.. ఆకాశ మార్గాన వంతారాకు!గాయపడిన ఏనుగును రోడ్డు మార్గాన వందల కిలోమీటర్లు తీసుకెళ్తే, ఆ ప్రయాణపు నొప్పులను తట్టుకోవడం దాని వల్ల కాదు. ఈ పరిస్థితిని గమనించిన వెటర్నరీ వైద్యులు దాని ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు విమానంలో తరలించడమే సరైన మార్గమని నిర్ణయించారు. అనంత్ అంబానీ నేతృత్వంలోని వంతారా సంస్థ వెంటనే స్పందించి, నిపుణులైన వైద్య బృందం సంరక్షణలో జాయ్మతికి ఎలాంటి శ్రమ కలగకుండా ప్రత్యేకంగా సిద్ధం చేసిన విమానంలో గుజరాత్లోని