రాజమండ్రి వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఐపీఎస్ అధికారి, ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మునీష్ను దర్యాప్తు అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కేసును దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. సౌత్ డీఎస్పీ శివప్రియ, ప్రకాశంనగర్ సీఐ బాజీలాల్ సహకారం అందించాలంటూ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని ఓ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో ప్రియాంక పీజీ చేస్తున్నారు. ఆగస్టు మూడో తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమా చూసిన ప్రియాంక.. ఆ తర్వాత స్నేహితుడితో కలిసి స్కూటీపై రిటర్న్ అయ్యారు. అయితే, ఆదిత్య మాల్ గేట్ వద్ద ఆగి ఉన్న సమయంలో నామవరానికి చెందిన దుష్యంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్ అద్ద ఇద్దరు యువకులు మద్యం మత్తులో ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని ఒకటికి మూడుసార్లు ఢీకొట్టారు.READ ALSO AP స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్.. 2025 నాటి ఓటర్ల జాబితాతోనే ఎలక్షన్స్!కారుతో ఢీకొట్టిన తర్వాత ప్రియాంకపై కారు ఎక్కించడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రియాంక స్వస్థలం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఏక్లాస్పూర్ కావడంతో ఆగస్టు ఐదో తేదీన మెరుగైన చికిత్స కోం సికింద్రబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ప్రియాంక ఆరోగ్యం విషమించి పదో తేదీన కన్నుమూశారు. ప్రియాంక మృతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తమ భవిష్యత్ ఉన్న వైద్య విద్యార్థిని మరణం తనను ఆవేదనకు గురి చేసిందంటూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందించాలని