© 2026 nimisham.in
మణుగూరు గ్యాంగ్వార్ హత్య కేసు ఛేదింపు.. 27 మంది నిందితులు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సంచలనం సృష్టించిన గ్యాంగ్వార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మణుగూరు నేతాజీ గ్రౌండ్లో ఈ నెల 27న జరిగిన శివ హత్య కేసులో మొత్తం 27 మందిని నిందితులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రాఖీ పండుగ కోసం ఇంటికి వచ్చిన శివను, ఎం.కే గ్యాంగ్ సభ్యులు మాట్లాడాలని చెప్పి నేతాజీ గ్రౌండ్కు పిలిచారు. అక్కడ ఇరువర్గాల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. గ్రూప్లోని సభ్యులు విచక్షణారహితంగా దాడి చేయడంతో శివ ప్రాణాలు కోల్పోయాడు. నిందితులంతా మణుగూరు స్థానికులేనని, కేవలం పార్టీల పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. అయితే, నిందితులు గంజాయి వంటి మాదకద్రవ్యాలు తీసుకుంటున్నట్లు విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదని డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వార్తకు సంబంధించిన