
Tanuku: ఘనంగా మానవతా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం! తణుకు: మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం తణుకు పట్టణంలో మానవతా శాంతి ర్యాలీ నిర్వహించారు. తోలుత ర్యాలీని ప్రిన్సిపాల్ K శ్రీనివాసరావు స్థానిక చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభించి అనంతరం నరేంద్ర కూడలి మీదుగా ఎన్టీఆర్ పార్క్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బిసి వసతి గృహాల్లో విద్యార్థులకు బాక్సులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ తణుకు శాఖ అధ్యక్షుడు వంగూరి హనుమంతరావు, బోయపాటి రామలక్ష్మి, యస్ వి సతీష్ బాబు,పాతూరి శివన్నారాయణ, ఆకుల శేషుబాబు,కడించర్ల రాజరాజేశ్వరరావు., పుప్పాల రామకృష్ణ , డాక్టర్ దాట్ల సత్యనారాయణ రాజు,పిఆర్ కె రాజు బోడపాటి ప్రసాద్ ఒబిలిశెట్టి హరనాథ్ అక్కా పంతుల బాలాజి, వి.శ్రీనివాస రావు, ఎస్బిఐఎం ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, ఎస్ఎన్విటి జూనియర్ కళాశాలల విద్యార్థు పాల్గొన్నారు
.