
వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఇప్పటిది కాదు. లెక్కప్రకారం, ‘అర్జున్ రెడ్డి’ తర్వాతే ఉండాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. అలా అని పూర్తిగా తలుపులు మూసుకుపోలేదు. మహేష్ బాబుతో సందీప్ రెడ్డి వంగ ఇప్పటికీ టచ్ లోనే ఉన్నాడు. ఇద్దరి మధ్య చర్చలు సాగుతూనే ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో రెండేళ్ల తర్వాతైనా ఈ కాంబినేషన్ కలిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ సోదరుడు, నిర్మాత ప్రణయ్ వెల్లడించాడు. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న వంగ, అది పూర్తయిన వెంటనే 6 నెలలు గ్యాప్ తీసుకొని ‘యానిమల్ పార్క్’ మొదలుపెడతాడు. ఆ తర్వాత మహేష్ బాబు సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందంటున్నాడు. అయితే సందీప్ వంగ మనసులో ఏముందో తను అప్పుడే చెప్పలేనంటున్నాడు ప్రణయ్. రీసెంట్ గా మహేష్ బాబు పుట్టినరోజుకు సందీప్ రిలీజ్ చేసిన ఓ ఏఐ వీడియో సూపర్ హిట్టయింది. స్వయంగా మహేష్ ఆ వీడియోపై స్పందించి, వంగాకు థ్యాంక్స్ చెప్పాడు. అప్పట్నుంచి ఈ కాంబినేషన్ పై జోరుగా ప్రచారం సాగుతోంది. సందీప్ రెడ్డి వంగ ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీస్తే, గతంలో ‘అర్జున్’ అనే సినిమాలో నటించాడు మహేష్ బాబు. సో, వీరిది ‘అర్జున్’ కాంబో అనుకోవాలి
.