
రాజోలి: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొనే క్రీడాకారుల ఎంపికలో భాగంగా జిల్లా స్థాయి ఎంపికలు ఈ నెల 3న గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రామలింగేశ్వర గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆసక్తి, అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 3న ఉదయం 10:30 గంటలకు ఎంప్లాయి ఐడీ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో జిల్లా యువజన క్రీడల అధికారి కార్యాలయంలో హాజరై తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ప్రోత్సహించడమే ఈ ఎంపికల ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా యువజన క్రీడల అధికారి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: భాజపా రాజోలి: కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, దాడి చేసిన వారిని వదిలేసి, పరామర్శకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం హేయమైన చర్య అని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రా రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు అరెస్ట్ నేపథ్యంలో ఐజ పట్టణంలో రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతుంటే, బాధితుల ఇళ్లకు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం శాఖ వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధితులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజ పట్టణ, మండల అధ్యక్షులు ముదిరాజ్ నర్సింహ, గోపాలకృష్ణ, లక్ష్మణ్ గౌడ్, శ్రీకాంత్, వీరేష్, సిద్దు తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే