© 2026 nimisham.in

ఆర్మీ కాంపౌండ్లో ఆయుధాల చోరీ నాలుగు ఏకే-47 రైఫిళ్లు మాయం రంగంలోకి దిగిన బొల్లారం పోలీసులు Madras Regiment Incident: సికింద్రాబాద్లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్(Madras Regiment Incident) ప్రాంతంలో సంచలన ఘటన వెలుగు చూసింది. ప్రహరీ గోడలు, మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉండే ఆర్మీ కాంపౌండ్లోకి చొరబడిన దుండగులు ఆయుధాల గది తాళాలు పగలగొట్టి ఏకంగా 12 అత్యాధునిక ఆయుధాలను అపహరించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. చోరీకి గురైన వాటిలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, ఆరు పిస్టళ్లతో పాటు భారీగా మందుగుండు సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆర్మీ అధికారులు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. HYDRAA Ranganath: హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా రంగనాథ్.. సింగిల్ జడ్జ్ తీర్పుపై సవాల్.. విచారణపై తీవ్ర ఉత్కంఠ సీసీ ఫుటేజ్ పరిశీలన, లోపలి వ్యక్తుల ప్రమేయంపై అనుమానాలు: రక్షణ రంగానికి చెందిన సున్నితమైన అంశం కావడంతో పోలీసులు వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతూ వేగంగా శోధిస్తున్నారు. ఆయుధాల బరువు, పరిమాణం దృష్ట్యా ఈ చోరీలో ఒకరి కంటే ఎక్కువ మంది పాల్గొని ఉంటారని, ఆర్మీ కాంపౌండ్ లోపలి వ్యక్తుల సహకారం ఉందా అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బందితో పాటు ఇటీవల లోపలికి వచ్చి వెళ్లిన వారి వివరాలు, సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఆయుధాలు నిజంగానే చోరీ అయ్యాయా లేక రికార్డుల్లో తేడాల వల్ల మిస్సింగ్గా కనిపిస్తున్నాయా అనే కోణంలోనూ ఆర్మీ స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేస్తున్నారు
.