
చాలామంది మహిళలు కుటుంబం, ఉద్యోగ బాధ్యతలు తీరిపోయాక... ఇంటికే పరిమితమవుతారు. కానీ అలా ఆలోచించలేదు విశాఖపట్నానికి చెందిన మాధవి సూరిభట్ల. చాలామంది మహిళలు కుటుంబం, ఉద్యోగ బాధ్యతలు తీరిపోయాక... ఇంటికే పరిమితమవుతారు. కానీ అలా ఆలోచించలేదు విశాఖపట్నానికి చెందిన మాధవి సూరిభట్ల. తనలోని కళా నైపుణ్యానికి పదును పెట్టి, దాన్ని మరో నలుగురికి నేర్పుతూ ... చివరకు అదే కళను సామాజిక సేవకు ముడిపెట్టి... ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా 47 వేలకు పైగా జాతీయ పతాకాల ప్రదర్శనతో గిన్నిస్ రికార్డుని అందుకున్నారు. ఇందుకోసం ‘మహిళా మనోవికాసం’ పేరుతో ఓ ఆన్లైన్ గ్రూపుని నిర్వహిస్తున్నారు. దీనిద్వారా స్త్రీశక్తిని ప్రపంచానికి చాటాలనీ, వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా వాళ్లందరికీ చేతివృత్తులను నేర్పిస్తున్నారు. అలాగని అవి కేవలం అలంకరణ వస్తువులకే పరిమితం కాదు. నిత్య జీవితంలో ఉపయోగపడేలానూ వాటిని తీర్చిదిద్దుతూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. మాధవి బృందం ఇప్పటికే స్కార్ఫ్ల ప్రదర్శన, శిల్పాలు, క్రిస్మస్ అలంకరణలు, హనుమాన్ చాలీసా పారాయణం, టీచర్స్డే కార్యక్రమం వంటివెన్నో చేశారు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ జెండా ఉండాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు జాతీయ పతాకాల తయారీపై దృష్టి పెట్టారు. అలాగని ప్లాస్టిక్వి చేస్తే పర్యావరణ ఇబ్బందులు చాలానే. అందుకే, ఊలుతో జెండాలు అల్లి రికార్డు సాధించాలనుకున్నారామె. ఇందుకోసం కొందరికి అవసరమైన శిక్షణిచ్చారు. అలా 330 మంది మహిళలు... 18 నెలల పాటు 47,617 జాతీయ జెండాలను సిద్ధం చేసి ఈ నెల 7న విశాఖపట్నంలో ప్రదర్శించారు. గిన్నిస్ నిబంధనల ప్రకారం 12.18 కి.మీ. మేర జెండాల ప్రదర్శన నిర్వహించి, గతంలో నెదర్లాండ్స్ బృందం నెలకొల్పిన 11 కి.మీ. రికార్డును అధిగమించారు. దీంతో మాధవికి ఇది వ్యక్తిగతంగా తొమ్మిదో ప్రపంచ రికార్డుగా నిలిచింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ