
<figure><img src="https://static.10tv.in/wp-content/uploads/2026/09/LPG-Refill-Booking-Rule-1024x576.jpg" class="attachment-large size-large wp-post-image" alt="LPG Refill Booking Rule" decoding="async" loading="lazy" /></figure><ul> <li><strong>ఎల్పీజీ కస్టమర్లకు భారీ గుడ్న్యూస్.. 25 రోజులకే రీఫిల్ బుకింగ్</strong></li> <li><strong>గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ బుకింగ్ గడువు తగ్గింపు</strong></li> <li><strong>ఎల్పీజీ రీఫిల్పై ఆంక్షలు సడలింపు.. కేంద్రం తాజా ప్రకటన</strong></li> </ul> <p><strong>LPG Refill Booking Rule :</strong> గ్యాస్ బుకింగ్ కోసం చూస్తున్నారా? ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లోని గ్యాస్ వినియోగదారులకు నిజంగా సూపర్ గుడ్ న్యూస్..<br /> డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.</p> <p><strong>ఇక 25 రోజుల్లోనే రీఫిల్ బుకింగ్ : </strong><br /> ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు కూడా 25 రోజుల వ్యవధిలోనే ఎల్పీజీ గ్యాస్ రీఫిల్ను బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవధి 45 రోజులుగా ఉంది. తాజాగా 25 రోజులకు తగ్గించినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వెల్లడించారు.</p> <p>ఎల్పీజీ సరఫరా పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, పెండింగ్లో ఉన్న రీఫిల్ బుకింగ్లు భారీగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇది తక్షణమే అమలు చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి సురేష్ గోపి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన లేఖను కూడా తన పోస్టులో షేర్ చేశారు.</p> <p><strong>Read Also : <a href="https://10tv.in/telugu-news/business/changed-jobs-frequently-you-may-have-multiple-pf-accounts-heres-how-to-fix-it-sh-1133752.html">Multiple PF Accounts : ఉద్యోగాలు మారారా? మీ పేరుతో ఎన్ని PF ఖాతాలు ఉన్నాయో తెలుసా? ఇలా చెక్ చేయండి</a> </strong></p> <p><strong>అందుకే బుకింగ్ వ్యవధిలో మార్పులు :</strong><br /> అంతర్జాతీయ పరిణామాల ప్రభావం నేపథ్యంలో ఎల్పీజీ సరఫరా కొరత ఏర్పడింది. గతంలో బుకింగ్ వ్యవధిలో మార్పులు చేసినట్లు ఆయన వివరించారు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగిన యుద్ధం, హోర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయం కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని చెప్పారు. దేశంలో ఎల్పీజీ కొరత తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా బుకింగ్ వ్యవధిని మార్చినట్లు తెలిపారు.</p> <p>ప్రస్తుత పరిస్థితుల్లో సరఫరా వ్యవస్థ మెరుగుపడిందని, దాంతో ప్రభుత్వం కూడా గ్యాస్ వినియోగంపై ఆంక్షలను సడలించింది. ప్రస్తుతం పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య తేడా లేకుండా గృహ వినియోగదారులందరూ 25 రోజుల వ్యవధిలో రీఫిల్ బుక్ చేసుకోవచ్చునని మంత్రి స్పష్టం చేశారు.