
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) బృందానికి రాజస్థాన్లో చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామంలోకి రావొద్దంటూ కొంతమంది స్థానికులు వారిని వెళ్లగొట్టారు. ఈ క్రమంలో ఒకింత ఉద్రిక్తత నెలకొంది. దీనిపై స్పందించిన సీజేపీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.. రాష్ట్రంలోని (Rajasthan) భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రంకా నేతృత్వంలో కొంతమంది కార్యకర్తలు శుక్రవారం రాజస్థాన్లో పర్యటించారు. ఈ సందర్భంగా జైపుర్ జిల్లాలోని రాంపురా కన్వర్పురా గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. శివారులోనే స్థానికులు వీరిని అడ్డుకున్నారు. తమ స్కూళ్లను తామే బాగు చేసుకుంటామంటూ.. గ్రామస్థులు సీజేపీ టీమ్ను బలవంతంగా అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ క్రమంలోనే స్థానికులు తమపై దాడి చేసినట్లు అశుతోష్ ఆరోపించారు. తమ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారని, తమ వాహనాలపై ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అక్కడకు రాలేదని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. తమ బృందంపై దాడి భాజపా పనేనని మండిపడ్డారు. ఈ ఘటనలో తమ వాళ్లు గాయపడ్డారని తెలిపారు. రాజస్థాన్లో గూండాల పాలన ఉందని ఆరోపించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వరద నీటిలో చిక్కుకున్న 60 ఏళ్ల వృద్ధురాలిని ఓ ఆశా వర్కర్ మోసుకెళ్లిన ఘటన ఒడిశాలోని భద్రక్