
Lingamaneni Sanjush Clarifies Accident Was Unfortunate Not Negligence
హైదరాబాద్ నగరంలోని ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ స్పందించాడు. ఈ ఘటన తన నిర్లక్ష్యం వల్ల జరగలేదని, ఇది కేవలం దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదమని పేర్కొన్నాడు.
హైదరాబాద్ నగరంలోని ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ స్పందించాడు. ఈ ఘటన తన నిర్లక్ష్యం వల్ల జరగలేదని, ఇది కేవలం దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదమని పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా వ్యవహరించి, గాయపడిన యువతి భారతిని తానే స్వయంగా ఆసుపత్రికి తరలించానని తెలిపాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ప్రమాద వివరాలను పోలీసులకు తెలియజేశానని వివరించాడు.ఆగస్టు 16న మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న భారతి (26) అనే యువతిని సంజూష్ నడుపుతున్న ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. భారతి ఇనార్బిట్ మాల్లోని లైఫ్స్టైల్ స్టోర్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. సంజూష్ కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు సంజూష్పై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 106(1) కింద నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమైనందుకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ నేరం బెయిలబుల్ కావడంతో పోలీసులు అతడికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.పోలీసుల దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని సంజూష్ స్పష్టం చేశాడు. ప్రమాదం తర్వాత పోలీసులు






