© 2026 nimisham.in

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటనలో తెలిపింది. వాతావరణ కేంద్రం ప్రకారం.. రుతుపవన ద్రోణి ఈరోజు సగటు సముద్ర మట్టం వద్ద ఫిరోజ్పూర్, డెహ్రాడూన్, షాజహాన్పూర్, వారణాసి, దెహ్రీ, జార్ఖండ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఉన్న వాయుగుండం (Depression) కేంద్రం, దిఘా మీదుగా వెళుతూ అక్కడి నుండి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండి, దీనిలో ఉత్తర హర్యానా & దాని పరిసర ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్ & దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనాలు (cyclonic circulations) ఇమిడి ఉన్నాయి. సముద్ర మట్టానికి 3.1, 9.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య, మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారుగా 22°N అక్షాంశం వెంబడి ఉన్న షియర్ జోన్ (Shear Zone) ఇప్పుడు బలహీనపడింది (less marked). వీటి ప్రభావంతో తెలంగాణలో మంగళవారం, బుధవారం కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల రెండు రోజులు. రోజులలో క్రింది స్థాయి ఉపరితల గాలుల వేగం 30 నుంచి 40 కి.మీ వరకు కొన్ని ప్రాంతాలలో కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు, రేపు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఏపీలో కూడా
వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..