
ఆదోని నేరవార్తలు: ఆస్పరి మండలంలో బుధవారం ఓ పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. మండల పరిధిలోని ఆస్పరి చిరుమాందొడ్డి హాలిగేరా శంకరబండ గ్రామాల్లో వీరంగం సృష్టించి గ్రామస్థులపై దాడి చేసింది. పిచ్చికుక్క దాడిలో దాదాపు 20 మందికి పైగా గ్రామస్థులకు గాయాలయ్యాయి. వారంతా చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. కాగా ఆ పిచ్చికుక్కను గ్రామస్థులు చంపినట్లు తెలుస్తోంది. ఆదోని నేరవార్తలు: ఆదోని మండలం బల్లెకల్ గ్రామానికి చెందిన కోసిగి నరసింహులు (66) అనే వృద్ధుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన నర్సింహలుకు భార్య బసమ్మ, ఒక కుమార్తె సంతానం. పొలం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా నరసింహులు భార్య బసమ్మ భర్తతో గొడవపడి బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంటికి రమ్మన్నా భార్య రాకపోవడంతో మనస్థాపానికి గురైన నరసింహులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద తుంబలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు