
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు కొమ్ముకాస్తూ కాంగ్రెస్ చేసిన పోరాటానికి సంబంధం ఉన్న విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడానికి వెనకాడుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు ఆరోపించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహించే సేవాసంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు 17వ తేదీన దీపాలంకరణలతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.





