
అరుణాచల్ ప్రదేశ్లోకి చైనా సైన్యం 60 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చిందంటూ వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. ఈ కథనాలు పూర్తిగా వాస్తవ విరుద్ధమని స్పష్టం చేశారు. అరుణాచల్లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో వాస్తవాధీన రేఖను దాటి చైనా సైనికులు లోపలికి వచ్చినట్లు స్థానికులు ఆరోపించిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చారు.ఈ సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ, "భారత్-చైనా మధ్య అరుణాచల్ ప్రదేశ్లో సుదీర్ఘ సరిహద్దు ఉంది. క్షేత్రస్థాయిలో ఈ సరిహద్దును ఇప్పటికీ పూర్తిస్థాయిలో, స్పష్టంగా నిర్ణయించలేదు. టిబెట్తో మన సరిహద్దును గతంలో సరిగ్గా గుర్తించకపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలు పెరిగాయి" అని వివరించారు. స్థానికుల ఆందోళనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని చెబుతూనే, బంగ్లాదేశ్కు చెందిన పాత వీడియోలను సామాజిక మాధ్యమాల్లో చూపిస్తూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. ఇటువంటి చర్యలు సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనిక బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పనలో గత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కిరణ్ రిజిజు ఈ సందర్భంగా ఆరోపించారు. "సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు నిర్మించకపోవడమే తమ విధానమని నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పార్లమెంటులోనే చెప్పారు. దీనివల్ల చైనా మనకంటే ముందే అక్కడే మౌలిక సదుపాయాలను నిర్మించుకోగలిగింది. 2014లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రోడ్లు లేని మారుమూల ప్రాంతాల్లోనూ యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు చేపట్టాం" అని తెలిపారు. సరిహద్దులు స్పష్టంగా లేని కొన్ని ఎత్తయిన ప్రాంతాల్లో చైనా