
కేరళకు చెందిన సోషల్ మీడియా కపుల్ అఖిల్-మేఘా వ్యవహారం వైరల్గా మారింది. భార్యపై అఖిల్ చేసిన సంచలన ఆరోపణలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. లక్షల మంది ఫాలోవర్లు.. వేలాది మంది అభిమానులు.. సోషల్ మీడియాలో చూస్తే ఆదర్శ దంపతులు. కానీ కెమెరా ఆఫ్ అయ్యాక మాత్రం అసలు కథ వేరేనా..? ప్రేమ, అనుబంధం, హ్యాపీ ఫ్యామిలీ అంటూ వీడియోలు చేసిన జంట.. ఇప్పుడు విడిపోయింది. అంతేకాదు. భార్య ఓ బస్సు క్లీనర్తో వెళ్లిపోయిందని భర్త చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అసలు ఈ వైరల్ కథ ఏంటి..? కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా జంట.. అఖిల్ (AKHIL), మేఘా (MEGHANA). ఇన్స్టాగ్రామ్లో వీరిద్దరికీ లక్షలాది మంది ఫాలోవర్లు. క్యూట్ వీడియోలు, ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్ రీల్స్తో ఎంతోమందికి ఫేవరెట్ కపుల్గా మారిపోయారు. కానీ.. ఆ చిరునవ్వుల వెనుక దాగి ఉన్న నిజం మాత్రం ఇప్పుడు బయటపడిందంటూ అఖిల్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన భార్య మేఘా.. ఓ లోకల్ బస్సు క్లీనర్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని అఖిల్ ఆరోపించాడు. అంతేకాదు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన వస్తువులు కూడా తీసుకెళ్లిందని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు తమ ప్రేమకథను చూసి అసూయపడిన వాళ్లే. ఇప్పుడు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఇంత హ్యాపీగా కనిపించిన వాళ్ల జీవితంలో ఇంత పెద్ద తుఫాన్ ఉందా..?" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అఖిల్ విడుదల చేసిన వీడియోలో.. తన కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించాడు. తాను తీవ్ర మానసిక వేదనలో ఉన్నానని కూడా చెప్పాడు. అయితే.. ఈ వ్యవహారంపై మేఘా నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. ఆమె వాదన ఏంటి..? నిజంగా ఏం జరిగింది..? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి నవ్వు