TG Mohandas Taken Into Custody : నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రైట్వింగ్ రాజకీయ విశ్లేషకుడు టీజీ మోహన్దాస్ను పోలీసులు ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా జంతర్ మంతర్ వద్ద అత్యాచారాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్న ఆయన.. ఆడవాళ్లు ఆ రేప్లను ఎంజాయ్ చేస్తారని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం చెలరేగగా.. మట్టంచేరిలోని ఆయన నివాసం నుంచి తిరువనంతపురం సైబర్ పోలీసుల బృందం స్థానిక పోలీసుల సహాయంతో మోహన్దాస్ను కస్టడీలోకి తీసుకుంది. ఈ విచారణ ప్రక్రియకు సంబంధించి పోలీసులు ఆయన నివాసంలో పలు కీలక ఆధారాలను సేకరించారు.కేసు విచారణలో భాగంగా తిరువనంతపురం సైబర్ పోలీస్ స్టేషన్ ప్రత్యేక బృందం ఆదివారం సాయంత్రం మట్టంచేరి సమీపంలోని కూవపడమ్లో ఉన్న మోహన్దాస్ ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో టీజీ మోహన్ దాస్ ఇంటి వద్దే ఉండటంతో అధికారులు నేరుగా విచారించారు. అతడు నిర్వహిస్తున్న 'పత్రిక' అనే యూట్యూబ్ ఛానెల్ ఖాతా వివరాలతో పాటు సదరు వివాదాస్పద వీడియోను రూపొందించి అప్లోడ్ చేసేందుకు ఉపయోగించిన ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై అందులోని సమాచారాన్ని విశ్లేషించారు.అసలేం జరిగిందంటే?పత్రిక అనే యూట్యూబ్ ఛానెల్లో ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. అందులో టీజీ మోహన్ దాస్ మాట్లాడుతూ.. ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థినుల ఆందోళనలు గ్యాంగ్ రేప్లకు దారితీసే అవకాశం ఉందంటూ అంచనా వేశారు. అంతేకాకుండా అక్కడికి హాజరయ్యే వారు అలాంటి చర్యలను ఇష్టపడతారంటూ అత్యంత అభ్యంతరకర రీతిలో మాట్లాడారు. అక్కడితో ఆగకుండా ఒకవేళ ఆ పరిస్థితిని నియంత్రించే బాధ్యత తన చేతుల్లో ఉంటే గనక, వెంటనే కర్ఫ్యూ విధించి నిరసనకారులను చెదరగొడతానని పేర్కొన్నారు. వారు వినకపోతే నేరుగా 'ఓపెన్ ఫైరింగ్' జరపాలని ఆదేశిస్తానని అన్నారు. ఆ కాల్పుల్లో కొందరు మరణించినా