
కమాన్పూర్: కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలంలోని జూలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం ఎన్టీపీసీ సౌజన్యంతో సైకిళ్లు, క్రీడా దుస్తులు, పుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచి పోలుదాసరి వనిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని సుజాత, ఉపసర్పంచి గడ్డం రాజమహేందర్, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.