
కరీంనగర్ టౌన్: భారత ప్రభుత్వం, జల్ శక్తి మంత్రిత్వ శాఖ చేపట్టిన జాతీయ ఉద్యమంలో భాగంగా దేశంలోని 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలపై అవగాహన కల్పించేందుకు ప్రచారకార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నగరంలోని ప్రధాన కూడలల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాయి. అయితే, ఆ హోర్డింగ్ముందు కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జన్మదిన వేడుకలు పూర్తయి నాలుగు రోజులు గడిచినా వాటిని తొలగించకపోవడంతో ఆ హోర్డింగ్స్ మరుగున పడిపోయాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.