
మంథని గ్రామీణం: పెద్దపల్లి జిల్లా మంథని దేశభక్తి నినాదాలతో మార్మోగింది. స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటుతూ మంథనిలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని విద్యార్థులు, నాయకులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో ప్రధాన వీధుల్లో ర్యాలీ కొనసాగింది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమగ్రత, ఐక్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించడమే ఈ తిరంగా ర్యాలీ ప్రధాన ఉద్దేశం. ప్రతి ఒక్కరూ దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలి. మంథనిలో జరిగిన ఈ తిరంగా ర్యాలీ దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. మంథనిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కలిసి భరతమాత, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, మహాత్మగాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి మొదలగు వేషధారణలతో పాల్గొనడం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు