
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సంచలనం సృష్టించిన వ్యాపారి వినీత్ మీనోచా హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రూ. 40 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న కుటుంబ వ్యాపారంలో కోడలు శాలుకు స్వేచ్ఛ లేకపోవడం, చిన్న ఖర్చులకైనా మామను అడగాల్సి రావడం ఆమెకు తీవ్ర కోపం తెప్పించింది. ఇంటి నిండా సీసీటీవీలు పెట్టి తన కదలికలపై నిత్యం నిఘా పెట్టడం, అర్ధరాత్రి వరకు పార్టీలకు వెళ్లనివ్వకపోవడం, ఆలస్యంగా వస్తే నిలదీయడం వంటి విషయాలపై రగిలిపోయిన శాలు.. మామపై కక్ష పెంచుకుని ఈ హత్యకు పథకం వేసింది. పోలీసులు నిందితుల కాల్ రికార్డ్స్ పరిశీలిస్తే దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. హత్య జరగడానికి ముందు కేవలం 21 రోజుల్లోనే మాజీ పనిమనిషి విశాల్ గౌతమ్తో ఆ ఇంట్లోని వారు విపరీతంగా ఫోన్లలో మాట్లాడారు.