
కంటెంట్ ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటి కామాక్షి భాస్కర్ల. ‘పొలిమేర’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఆమె, తాజాగా ‘అగధ’ అనే మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన ఈ చిత్రం రేపు (ఆగస్ట్ 14) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కామాక్షి మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలను, తన వ్యక్తిగత ప్రయాణాన్ని పంచుకున్నారు. ఈ సినిమాలోని ‘మహాదేవి’ పాత్ర కోసం తాను బౌద్ధ మతానికి సంబంధించిన పుస్తకాలు చదవడమే కాకుండా, బ్లాక్ మ్యాజిక్ గురించి కూడా తెలుసుకున్నానని ఆమె చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి.మహాదేవి పాత్ర కోసం సిద్ధమవ్వడం ఒక పెద్ద సవాల్ అని కామాక్షి తెలిపారు. "ఆ పాత్ర కోసం నేను కామాక్షిని పూర్తిగా పక్కన పెట్టాల్సి వచ్చింది. నా సొంత వ్యక్తిత్వాన్ని, సిద్ధాంతాలను వదిలి ఆ పాత్రలోకి మారడానికి కాస్త ఇబ్బంది పడ్డాను. ప్రతి ముద్ర, ఆ పాత్ర నడవడిక గురించి లోతుగా అర్థం చేసుకుని నటించాను. సినిమాలో ఎక్కడా కామాక్షి కనిపించకూడదని జాగ్రత్త పడ్డాను" అని ఆమె వివరించారు. తన అభిమాన దర్శకుడు ఎం.ఎస్. రాజు నుంచి ఫోన్ రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఆయన తీసిన 'మనసంతా నువ్వే' తన ఆల్ టైం ఫేవరేట్ అని తెలిపారు.సీనియర్ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి తనను అనుష్కతో పోల్చడంపై స్పందిస్తూ, "అంత పెద్ద నిర్మాత అలా అనడం ఆనందంగా ఉంది. ఆయన అనుష్క గారితో పోల్చడం నా బాధ్యతను