
టెక్ దిగ్గజం యాపిల్లో నాయకత్వ మార్పు పూర్తయింది. జాన్ టెర్నస్ మంగళవారం కంపెనీ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో 15 ఏళ్లుగా యాపిల్ను నడిపించిన టిమ్ కుక్ శకం ముగిసింది. 2011 ఆగస్టులో స్టీవ్ జాబ్స్ తర్వాత సీఈఓగా బాధ్యతలు చేపట్టిన కుక్.. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కొనసాగనున్నారు.ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కుక్ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలతో సంబంధాలపై దృష్టి పెట్టనున్నారు. కంపెనీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లోనూ ఆయన సహకారం అందించనున్నారు. మరోవైపు టెర్నస్ యాపిల్ డైరెక్టర్ల బోర్డులోనూ చేరారు.టెర్నస్ 2001లో యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ విభాగంలో చేరారు. 2021లో హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఎదిగారు. ఐప్యాడ్, ఎయిర్పాడ్స్, ఐఫోన్, మ్యాక్ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అత్యంత సన్నని ఐఫోన్ ఎయిర్, కొత్త మ్యాక్బుక్ నియో రూపకల్పనలోనూ ఆయన బృందం కీలకంగా వ్యవహరించింది.కుక్ హయాంలో భారీ వృద్ధికుక్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సమయంలో యాపిల్ మార్కెట్ విలువ సుమారు 350 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు అది దాదాపు 4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. కంపెనీ వార్షిక ఆదాయం 2011లో 108 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం 400 బిలియన్ డాలర్లను దాటింది.కుక్ హయాంలో యాపిల్ సర్వీసెస్ వ్యాపారం కూడా భారీగా వృద్ధి చెందింది. యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్, యాపిల్ పే వంటి సేవల ద్వారా ఏటా 100 బిలియన్ డాలర్లకుపైగా ఆదాయం వస్తోంది.ఇప్పుడు యాపిల్కు కీలక సవాళ్లతో కూడిన సమయంలో