కింద కేసు పెట్టారు? కస్టడీ, బెయిల్, మెజిస్ట్రేట్, అడ్వొకేట్ లాంటి పదాలేవీ అతడికి తెలియదు. అయితే తనకాకు జైల్లో ఓ ఖైదీ సాయం చేశాడు. మూడు హత్యలు చేయడంతో జైలుకు వెళ్లిన శంకర్ అనే ఖైదీ న్యాయపోరాటంలో తనకాకు సాయం చేశాడు. తనకా దగ్గర బెయిల్కు కూడా డబ్బులేనప్పుడు శంకర్ అతడికి అండగా నిలిచాడు. శంకర్ లేకపోతే తాను బయటకొచ్చే వాణ్ని కాదేమో అని తనకా చెప్పాడు. జైలు సిబ్బంది, సూపరింటెండెంట్ కూడా తనకాకు తమ వంతు సాయం చేశారు.తనకా జైలుకు వెళ్లక ముందు ఏకాగ్రత లోపం (ఏడీహెచ్డీ), నిద్రలేమి సమస్యలకు చికిత్స తీసుకుంటున్నాడు. అయితే జైల్లో ఉన్న 19 రోజులు అతడు మందులు వేసుకోలేదు. దీంతో అతడి ఆరోగ్యం దెబ్బతింది. అతడి మెడికల్ ప్రిస్క్రిప్షన్ హాస్టల్లో ఉంది. మెడికల్ డాక్యుమెంటేషన్ అవసరమయ్యే ఈ మందులను జైలు డాక్టర్ రాసి ఇవ్వడం కుదరదు.తనకా బెయిల్ మీద బయటకొచ్చాక.. తన వస్తువులు తీసుకోవడానికి పోలీసు స్టేషన్కు వెళ్లాడు. తనకా పరిస్థితి తెలుసుకున్న ఓ కానిస్టేబుల్ అతడికి రూ.1500 ఇచ్చాడు. కానీ ఎస్సై మాత్రం లంచం అడిగాడు. దీంతో ఆ పోలీసు ఆఫీసర్కు రూ.5500 ఇచ్చాడు. కొద్ది రోజుల తర్వాత కోర్టులో విచారణకు హాజరైనప్పుడు.. అదే పోలీసు ఆఫీసర్ కేసును సెటిల్ చేయడానికి రూ.3 వేలు డిమాండ్ చేశాడు. అయితే తనకా దీనికి ఒప్పుకోలేదు.పోలీస్ అధికారిపై ఫిర్యాదుతనపై నమోదైన క్రిమినల్ కేసును సవాల్ చేస్తూ తనకా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. ఈలోపే కరోనా మొదలైంది. కోచింగ్ సెంటర్ అధిపతి సమస్యను పరిష్కరించుకోవడానికి అంగీకరించడంతో 2020 నవంబర్ 2న హైకోర్టు తనకాపై కేసును కొట్టేసింది. తన దగ్గర లంచం డిమాండ్ చేసిన పోలీసు అధికారిపై ఫిర్యాదు చేస్తూ.. తనకా 2020 డిసెంబర్లో కర్ణాటక మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. ఓ రోజు డీఎస్పీ తమ్ముడిని తనకా హాస్టల్లో అనుకోకుండా కలిశాడు. మాటల మధ్యలో తనకా తన స్టోరీ చెప్పడంతో.. మానవ హక్కుల సంఘానికి వెళ్లమని అతడు సలహా ఇచ్చాడు.తన దగ్గర లంచం తీసుకున్న ఆర్టీ నగర్ పోలీసు స్టేషన్ ఎస్సైపై తనకా హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాడు. అయితే అప్పటికే ఆయన రిటైర్డ్ అయ్యాడు. కేసు ఎత్తేయడానికి లంచం అడిగిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని, తన ప్రయాణ ఖర్చులు ఇప్పించాలని అతడు కోరాడు.తనకాపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేయడం, అతడి వీసా గడువు దగ్గర పడటంతో.. 2021 ఫిబ్రవరి 28లోగా భారత్ విడిచి వెళ్లాలని ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆదేశించింది. అయితే మానవ హక్కుల సంఘంలో తాను వేసిన కేసు ఇంకా విచారణ దశలోనే ఉండటంతో.. స్వదేశానికి తిరిగి వెళ్లడం తనకాకు ఇష్టం లేకపోయింది.కుర్చీ దొంగతనందీంతో ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంటకు జేసీ నగర్ ఏసీపీ ఆఫీసుకు వెళ్లిన తనకా.. అక్కడి నుంచి ఓ తెల్లటి ప్లాస్టిక్ కుర్చీని ఉద్దేశపూర్వకంగా దొంగిలించి ఇంటికి తీసుకెళ్లాడు. ఏసీపీ ఆఫీసులో కుర్చీతో ఫొటోలు దిగి.. వాటిని ఎక్స్లో పోస్టు చేశాడు. ఈ చిన్న కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేస్తే.. స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం ఉండదనేది అతడి ఉద్దేశం. అయితే తనకా ప్లాన్ ఏంటో అర్థం చేసుకున్న పోలీసులు.. సోషల్ మీడియాలో అతడి పోస్టు వైరల్ అయినప్పటికీ, అతడిపై కేసు నమోదు చేయలేదు.దీంతో తనకా ఆ కుర్చీని తిరిగి ఏసీపీ ఆఫీసులో ఇచ్చేద్దాం అనుకున్నాడు. కానీ అతడు ఆ పని చేసేలోపే పోలీసులు అతణ్ని డిపోర్టేషన్ సెంటర్కు తరలించారు. 2021 ఏప్రిల్లో తనకాను జపాన్ డిపోర్ట్ చేశారు. దీంతో బెంగళూరులోని ఓ లాయర్ సాయంతో తనకా జపాన్ నుంచే న్యాయ పోరాటం కొనసాగించాడు. 2022 మే 9న తనకాకు అనుకూలంగా తీర్పునిచ్చిన మానవ హక్కుల సంఘం.. అతడికి రూ.75 వేలు పరిహారం చెల్లించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. లంచం డిమాండ్ చేసిన పోలీసు అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.కర్ణాటక హైకోర్టులో న్యాయపోరాటంరెండు నెలలు గడిచినా మానవ హక్కుల సంఘం ఆదేశాలు అమలు కాకపోవడంతో.. ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కోరుతూ తనకా 2022 సెప్టెంబరులో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు ఏళ్ల తరబడి కొనసాగింది. చివరకు 2026 ఏప్రిల్లో తనకా లాయర్ ఖాతాలోకి రూ.75 వేలు బదిలీ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ ఏడాది జూన్ 22న తనకా లాయర్ ఖాతాలో డబ్బులు జమ చేశారు.ఇంగ్లిష్ నేర్చుకోవడం కోసం ఇండియాకు వచ్చిన తనకా.. 19 రోజులు జైల్లో గడపడంతోపాటు.. హైకోర్టు, మానవ హక్కుల సంఘంలో న్యాయపోరాటం చేసి గెలిచాడు. ఈ క్రమంలో అతడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు.. ఎందరో మిత్రులను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.మార్చి 2024లో తనకా కోసం ఆమె జపాన్ వెళ్లింది. అప్పుడు ఇద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 2025లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులోనే ఉంది. తనకాను డిపోర్ట్ చేయడంతో అతడి పేరు బ్లాక్ లిస్ట్లో ఉంది. దీంతో అతడు ఇండియాకు తిరిగి రావడం కుదరడం లేదు. ముంబయిలోని ఓ లాయర్ సాయంతో బ్లాక్ లిస్ట్ నుంచి తన పేరు తొలగించుకోవడానికి తనకా ప్రయత్నిస్తున్నాడు. భారత్2కు వస్తే.. నార్త్ ఈస్ట్లోని తన అత్తగారింటికి వెళ్లి, తన భార్య తరఫు వారందర్నీ చూసి రావాలని తనకా ఆశపడుతున్నాడు.