
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్లో బలమైన స్పందన నమోదు చేస్తోంది. ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి బుక్మైషో, డిస్ట్రిక్ట్ వేదికల్లో టికెట్ల అమ్మకాలు వేగంగా సాగుతున్నాయి. ట్రేడ్ వర్గాలు, నిర్మాతల పోస్టుల ప్రకారం రెండు వేదికల్లో కలిపి 1.20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు నిజాం, ఆంధ్రా ప్రాంతాల్లో ఇరుముడి అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకోవడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ప్రారంభ దశలో బుక్మైషోలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం బయటకు వచ్చింది. ఆ తర్వాత బుకింగ్స్ వేగం పెరగడంతో బుక్మైషోలో 72 వేలకు పైగా టికెట్ల అమ్మకాలను సూచించాయి. డిస్ట్రిక్ట్లో మరో 38 వేలకు పైగా టికెట్లు అమ్ముడై మొత్తం సంఖ్య 1.10 లక్షలు దాటినట్లు పేర్కొన్నాయి. తాజా అంచనాల్లో ఇరుముడి అడ్వాన్స్ బుకింగ్స్ 1.20 లక్షల మార్కును కూడా దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో పలు షోలు వేగంగా నిండుతుండగా, కొన్ని చోట్ల పూర్తిస్థాయి బుకింగ్స్ కనిపిస్తున్నట్లు సమాచారం. దీంతో రవితేజ ఇటీవలి సినిమాలతో పోలిస్తే ‘ఇరుముడి’కి విడుదలకు ముందే మెరుగైన స్పందన కనిపిస్తోందనే అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రంలో తండ్రి, కూతురు అనుబంధాన్ని అయ్యప్ప దీక్ష నేపథ్యంతో మిళితం చేశారు. మద్యం అలవాటు, హింసాత్మక గతం ఉన్న తండ్రి తన కూతురు కోరికతో అయ్యప్ప దీక్ష చేపట్టడం కథలో ప్రధాన అంశం. ఇదిలా ఉండగా కుటుంబ భావోద్వేగాలతో పాటు యాక్షన్, ఉత్కంఠ అంశాలు కూడా ఉండటం వివిధ వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ట్రైలర్, పాటలకు వచ్చిన స్పందన కూడా ఇరుముడి అడ్వాన్స్ బుకింగ్స్కు ఊతమిచ్చినట్లు కనిపిస్తోంది. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటించగా, బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో కనిపించనుంది. సాయి కుమార్తో పాటు పలువురు కీలక పాత్రల్లో నటించగా, జీవీ